www.ntodaynews.com
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జెసిబి! 17 సంవత్సరాల బాలుడికి గాయాలు...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
పుంగనూరు పట్టణ పరిధిలోని ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనాన్ని జెసిపి ఢీకొనడంతో బాలునికి గాయలైన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని సింగిరిగుంట గ్రామానికి చెందిన లేట్ సుబ్రమణ్యం కుమారుడు సంతోష్(17) ద్విచక్ర వాహనంలో ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో వెళ్తుండగా జెసిపి ఢీకొనడంతో గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆటోలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.