ధర్మపురిలో పోచమ్మ ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం
ధర్మపురి (NToday News):
తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహాయ సహకారాలతో ధర్మపురి పట్టణంలోని 1వ వార్డులో శ్రీ పోచమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ పనులను ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ... ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేసి, త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ధర్మపురి పట్టణ అభివృద్ధికి, ఆలయాల పునర్నిర్మాణానికి ప్రత్యేక నిధులు అందిస్తూ సహకరిస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, local వార్డు కౌన్సిలర్ అయ్యోరి వేణుగోపాల్, కాలనీ నాయకులు మరియు వార్డు ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.