BREAKING
Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. Police News: రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీ, కాశ్మీర్‌లో ప్రకంపనలు నంద్యాల యువతకు నిరుద్యోగ 2000 వికాస భృతి నమోదు అవకాశం. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించండి
www.ntodaynews.com

​ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగకూడదు : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
12 May, 2026 - 08:55 AM
87 వీక్షణలు

NTODAY NEWS నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం  స్పష్టం చేశారు. సోమవారం నకిరేకల్ తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల ధాన్యం కొనుగోలుపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లి, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కొనుగోలు  కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, తేమ కొలిచే యంత్రాలు, తూకం మిషన్లు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన నగదును 48 గంటల్లోపు రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించడంతో పాటు, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులందరిపై ఉందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పౌరసరఫరాల అధికారులు, వివిధ మండలాల తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ ఏడిలు , రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, ఐకేపీ  మరియు ప్యాక్స్  సిబ్బంది పాల్గొన్నారు.