ధర్మవరం లో ఘనంగా హర్ గర్ తిరంగా ర్యాలీ
విద్యార్థులతో ఘనంగా ర్యాలీ.. భారీగా పాల్గొన్న విద్యార్థులు
స్థానిక మంత్రి, ఎమ్మెల్యే సత్యకుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల మీదుగా కొనసాగుతూ గాంధీ విగ్రహం వరకు సాగింది. విద్యార్థులు క్రమశిక్షణతో ర్యాలీలో పాల్గొంటూ కార్యక్రమం ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే సత్యకుమార్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, దేశభక్తి, క్రమశిక్షణ వంటి విలువలను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని సూచించారు.
ర్యాలీలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి ఇన్చార్జి హరీష్ బాబు, ఆసుపత్రి సిబ్బంది, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల భారీ పాల్గొనడంతో ర్యాలీ విజయవంతంగా సాగింది. అనంతరం గాంధీ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించి, మహాత్మా గాంధీ ఆశయాలను స్మరించుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.