రెండేళ్ల నమ్మకం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం
రెండేళ్ల నమ్మకం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం 100 శాతం పూర్తి చేసిన క్లస్టర్ 4 ఇన్చార్జ్లకు ఘన సన్మానం – బొడ్డు వెంకటరమణ చౌదరి
రాజానగరం,: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా కోరుకొండ మండలం క్లస్టర్–4 పరిధిలో 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసిన క్లస్టర్ బూత్ ఇన్చార్జ్లను ఘనంగా సన్మానించారు.
తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో, ఈ కార్యక్రమం జరిగింది. క్లస్టర్ 4 ఇంచార్జ్ అడపా వీరబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది
ఈ సందర్భంగా రెండేళ్ల నమ్మకం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం రాజానగరం నియోజకవర్గంలో క్లస్టర్ 4 మొదటిగా 100 శాతం పూర్తి చేయుట జరిగింది కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన క్లస్టర్ బూత్ ఇన్చార్జ్లతో పాటు వారికి సహకరించిన గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలను బొడ్డు వెంకటరమణ చౌదరి శాలువాలతో సత్కరించి అభినందించారు.
పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంలో బూత్ ఇన్చార్జ్లు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తల కృషి ఎంతో కీలకమని బొడ్డు పేర్కొన్నారు. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజలకు మరింత చేరువగా ఉండాలని ఆయన సూచించారు.