
గ్రామ సమస్యలపై ఎమ్మెల్యేతో చర్చించిన కాంగ్రెస్ నాయకులు
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిను ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పంజాల ఆంజనేయులు గౌడ్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆఫ్రోజ్ అలీ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గ్రామంలోని సంజయ్ కాలనీకి సంబంధించిన సర్వే నంబర్లు 740, 754లను నిషేధిత జాబితాలో చేర్చిన అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, సమస్యకు గల కారణాలను తక్షణమే తెలుసుకోవాలని, ఎమ్మార్వో ద్వారా జిల్లా కలెక్టర్, ఆర్డీవోతో చర్చించి ఫీల్డ్ విజిట్ నిర్వహించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచిస్తామని తెలిపారు.
అనంతరం గ్రామ సర్పంచ్ కడెం పాండురంగం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహంకాళికి అవసరమైన వైద్య సేవల కోసం నిమ్స్ ఆసుపత్రిలో తగిన సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే తన కార్యాలయ సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ అరిగే శ్రీధర్, వార్డు సభ్యులు పెంటబోయిన భాను, శ్రీ వేణు, మంద భాస్కర్, కడెం వెంకటేష్, కడెం సంపూర్ణ కిరణ్, పార్టీ సీనియర్ నాయకులు మంద మాధవులు, బొడ్డు శివబాబు, చిలకగూడెం పోషయ్య, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోట మహేష్, చిలకగూడెం బాబు, యూత్ కాంగ్రెస్ నాయకులు దేశం విజయ్ గౌడ్, మంద ఆనంద్, చిన్నగల్ల లింగస్వామి, చిన్నగల్ల రాము తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube