www.ntodaynews.com
జాతరలో అన్నదానం, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
తెలంగాణ
అగస్తీశ్వర స్వామి జాతరలో అన్నదానం, మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు
పుంగనూరు మండలం నెక్కొంది గ్రామ సమీపంలోని కొండపై వెలసిన అగస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు మూడు రోజులుగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ధ్వజోత్సవం భక్తులను ఆకట్టుకుంది.
జాతరకు చుట్టుపక్కల గ్రామాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ఈ సందర్భంగా ఏ కొత్తకోట గ్రామ యువత ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు పంపిణీ చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని యువకులు తెలిపారు. గత కొన్నేళ్లుగా జాతర సమయంలో అన్నదానం నిర్వహించడం కొనసాగుతోందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో నవీన్ కుమార్, బిందువర్ధన్, మురళీ మోహన్, ధనంజయ, సురేష్, విశ్వనాథ్, పవన్ కుమార్, సంతోష్, మునిరత్నం, మంజునాథ్ రెడ్డి, దేవరాజ్, చరణ్, రాకేష్, కార్తీక్, వెంకటేష్ తదితర యువకులు పాల్గొన్నారు.
#Punganur #AnnamayyaDistrict #AgastheeswaraSwamy #MahaShivaratri #Annadanam #YouthService #TempleFestival
Follow us on
Website
Facebook
Instagram
YouTube