www.ntodaynews.com
శ్రీశైలం దర్శనం చేసిన జిల్లా కలెక్టర్
తెలంగాణ
ఉచిత క్యూ లైన్ ద్వారా శ్రీశైలం దర్శనం చేసిన జిల్లా కలెక్టర్
NTODAY NEWS: శ్రీశైలం / నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున్
శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా ఉచిత క్యూ లైన్ ద్వారా సాధారణ భక్తులతో కలిసి దర్శనం చేశారు. సుమారు 20 నిమిషాల్లో స్వామివారి దర్శనం పూర్తి చేశారు.
దర్శనం అనంతరం భక్తులకు కల్పిస్తున్న సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. ఉచిత దర్శన క్యూ లైన్ల నిర్వహణ, భద్రతా చర్యలు, తాగునీరు, శానిటేషన్, వైద్య సదుపాయాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులను కలుసుకుని వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఉచిత క్యూ లైన్ ద్వారా దర్శనం కల్పించడాన్ని దేవస్థాన అధికారులు కొనసాగిస్తున్నారని తెలిపారు. భక్తులు నియమ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని సూచించారు.
#Srisailam #BhramarambaMallikarjuna #MahaShivaratri #TempleVisit #DistrictCollector #Nandyal #AndhraPradesh #TempleAdministration
Follow us on
Website
Facebook
Instagram
YouTube