www.ntodaynews.com
నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు
తెలంగాణ
నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తున్న కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం. రాజశేఖర్ .
NTODAY NEWS:గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి.
గొల్లప్రోలు మండలం.. గొల్లప్రోలు చేబ్రోలు మధ్యలో హైవే అనుకునివున్న పంట పొలాలను పరిశీలించడం జరిగింది గొల్లప్రోలు లో నీట మునిగిన వరి పొలాలను కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. రాజశేఖర్ పరిశీలించడం జరిగింది. శుద్ధగడ్డ వాగు వరద ఉద్రీతి వల్ల పంటలు దెబ్బతిన్నాయని..రైతాంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని రాజశేఖర్ అన్నారు. ప్రజాసంఘల నాయకులతో కలిసి మంగళవారం పంటలు పరిస్థితి చూడడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం లో ప్రతి సంవత్సరం ఖరీఫ్ పంటలు కాలంలో అధిక వర్షాలు, వరదలు వల్ల రైతాంగం నష్ట పోతుందని అన్నారు. డిప్యూటీ సీఎం ప్రతినిద్యం వహిస్తున్న నియోజకవర్గం లో రైతాంగాన్ని ఆదుకోవడానికి శాశ్వత వరద, ముంపు నివారణ చర్యలు చేపట్టాలని, శుద్ధగడ్డ, ఇతర వాగులను ఆదునీకరణ చేపట్టాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు టీ. రాజా, ఎం జి సూరిబాబు, జయరాం తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube