నక్కబండ ప్రాంతంలో సరైనటువంటి కాలువలు లేవు...
నక్కబండ ప్రాంతంలో సరైనటువంటి కాలువలు లేవు...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు పట్టణం నక్క బండ కాలనీలో ఈరోజు రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాస్తారోకో పాదయాత్ర చేయడం జరిగింది. ఇక్కడ నక్కబండ కాలనీవాసులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఏఐటీయూసీ పుంగనూరు పట్టణ కార్యదర్శి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ
ఈ నక్క బండ కాలనీలో రోడ్లమీద మురుగునీరు పారుతుంటే ఎన్నోసార్లు మున్సిపాలిటీ కమిషనర్ గారికి సమాచారం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఈ పుంగనూరు మున్సిపాలిటీ అధికారులు ఏ మాత్రం స్పందన లేదు
నీటి సమస్య చాలా ఎక్కువైపోయింది, వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుండి నీళ్లు మోయాల్సి వస్తోంది ఈ నక్కబండ ప్రాంతంలో
ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఉంటే మున్సిపాలిటీ పన్ను కడితేనే మీకు నీటి కనెక్షన్ వదులుతాము అనే పరిస్థితి నెలకొంది.
ఈ నక్కబడ్డ కాలనీలో చాలామందికి ఇళ్ల స్థలాలు లేవు చాలావరకు బాడిగలకు ఉన్నారు
ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరం పూర్తికావస్తున్న ఇంతవరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు.
గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తామని అధికారంలోకి రాకముందు తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి హామీలు తుంగలో తొక్కుతున్నారు
సిపిఐ పార్టీగా ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాము ఏ రోజుల్లో ఈ నక్కబండ కాలనీకి పూర్తిస్థాయిలో కాలువలు వేసి రోడ్లమీద మురుగునీరు రాకుండా చేయాలని అలాగే ఇల్ల స్థలాలు లేనివారికి వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి ఇల్ల పట్టాలు లేని వారికి వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము లేనిపక్షంలో పెద్ద ఎత్తున పేద ప్రజలకు కలుపుకొని మున్సిపల్ ఆఫీస్ ముట్టడి, ఎమ్మార్వో ఆఫీస్ ముట్టడి, కలెక్టరేట్ ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రామ్మూర్తి సహాయ కార్యదర్శి మున్నా సిపిఐ నాయకులు ముబారక్ఉన్నిసా, ఆదెమ్మ,ముంతాజ్, శైలజ,రెడ్డిరాని తదితరులు పాల్గొన్నారు .