కుప్పం మండలం జరుగు గ్రామంలో పౌర హక్కుల సమావేశం
కుప్పం మండలం జరుగు గ్రామంలో పౌర హక్కుల సమావేశం
ఎస్టీ కుటుంబాల సమస్యలపై అధికారులకు వినతి
NTODAY NEWS: కుప్పం
కుప్పం మండలం జరుగు గ్రామపంచాయతీలో శుక్రవారం పౌర హక్కుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల తహసీల్దార్తో పాటు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు, గ్రామ ప్రజలు, ఎస్టీ కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.
సమావేశంలో గ్రామానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ఎస్టీ కుటుంబాల సభ్యులు తమకు సొంత ఇళ్ల సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ గృహ పథకాల ద్వారా ఇళ్లను మంజూరు చేసి నివాస సమస్యను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించారు.
ఎస్టీ కుటుంబాల సమస్యలను పరిశీలించి, ప్రభుత్వ నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో గ్రామ ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, సంబంధిత శాఖల అధికారులు వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు.