www.ntodaynews.com
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో నందిని ప్రతిభ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో నందిని ప్రతిభ
ఈరోజు విడుదలైన ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాల్లో గుడుపల్లి మండలం కొడతానపల్లి ZPHS పాఠశాలకు చెందిన విద్యార్థిని నందిని విశేష ప్రతిభ కనబరిచింది.
వెంకటేష్ సర్పంచ్ కుమార్తె అయిన నందిని మొత్తం 600 మార్కులకు గాను 562 మార్కులు సాధించి ప్రతిభను చాటింది. ఆమె సాధించిన ఈ ఫలితం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా నందిని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్థులు ఆమెను అభినందించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.