ఎల్ నినో ప్రభావంతో రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తలు..
ఎల్ నినో ప్రభావంతో రైతులు తీసుకోవల్సిన జాగ్రత్తలు..
అన్నమయ్య జిల్లా.
చౌడేపల్లి
ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం అనిశ్చితంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం,పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చు.
రైతులకు ముఖ్య సూచనలు
నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల సాగు ప్రణాళిక రూపొందించాలి.వర్షాభావ పరిస్థితులకు అనుకూలమైన లేదా తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంపిక చేసుకోవాలి.డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించి నీటిని ఆదా చేయాలి.వరికి బదులు ఆరుతడి పంటలైన రాగి,సజ్జ,కొర్రలు,ఉలవలు ఇలాంటి పంటలు సాగు చేసుకోవాలి.పంటల్లో చీడపీడలు, వ్యాధులు కనిపించిన వెంటనే సమీప రైతు సేవా కేంద్రం లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.ఈ కార్యక్రమంలో పుంగనూరు సహాయ వ్యవసాయ సంచాలకులు శివకుమార్ పాల్గొన్నారు.