వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విద్యార్థులు.. వరి నాటుపై అవగాహన
వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన విద్యార్థులు.. వరి నాటుపై అవగాహన
ఎల్కతుర్తి: సామాజిక శాస్త్ర ప్రాజెక్టులో భాగంగా ఎల్కతుర్తి మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల 9, 10వ తరగతి విద్యార్థులు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు.
హెచ్ఎం దుర్గాభవాని ఆధ్వర్యంలో విద్యార్థులు వ్యవసాయ క్షేత్రంలో కూలీలతో కలిసి స్వయంగా వరి నాటు వేసే విధానాన్ని ప్రత్యక్షంగా నేర్చుకున్నారు. వ్యవసాయ పనులు, వరి సాగు పద్ధతులు, నాటు వేసే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
పుస్తకాల్లో చదివిన వ్యవసాయ విధానాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకోవడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయం పట్ల అవగాహన పెరిగిందని విద్యార్థులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగయ్య, రిజ్వానా, ప్రణతి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.