ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత: నీటి విడుదలపై అధికారులు హెచ్చరిక!
ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత: నీటి విడుదలపై అధికారులు హెచ్చరిక!
మంచిర్యాల, జూలై 31:
కడెం ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేయడం మరియు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు.
ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను ఎత్తి, సుమారు 1,00,000 (లక్ష) క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు హెచ్చరించారు.
అధికారుల ఆదేశాలు & హెచ్చరికలు:
నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ప్రాజెక్టు దిగువన ఉన్న నదీ పరివాహక ప్రాంత ప్రజలు, మత్స్యకారులు నీటిలోకి వెళ్లవద్దని కోరారు.
పశువులు, గొర్రెల కాపరులు జగర్త: గొర్రెల కాపరులు, పశువుల కాపరులు మరియు రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ గోదావరి నది వైపు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి.
పోలీస్, రెవెన్యూ యంత్రాంగం సన్నాహాలు: పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా ప్రజాప్రతినిధులకు, పోలీస్ మరియు రెవెన్యూ அதிகாரులకు సమాచారం అందించారు.
వరద ఉధృతి దృష్ట్యా ప్రజలందరూ అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షితంగా ఉండాలని మనవి.