www.ntodaynews.com
ఎల్నినో ప్రభావంపై రైతులకు మంత్రి తుమ్మల హెచ్చరిక
తెలంగాణ
/
హైదరాబాద్
ఎల్నినో ప్రభావంపై రైతులకు మంత్రి తుమ్మల హెచ్చరిక
హైదరాబాద్, జూలై 21: ఈసారి ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోవడంతో పంటలకు సాగునీరు అందించే పరిస్థితి లేదని చెప్పారు.
ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాలు కురుస్తాయనే ఆశతో రైతులు వరి నాట్లు వేయొద్దని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడే రైతులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వర్షపు నీటిని వృథా కాకుండా ప్రతి చుక్కను నిల్వ చేసేందుకు ఇంకుడుగుంతల నిర్మాణాన్ని చేపట్టాలని మంత్రి తుమ్మల సూచించారు. నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా ఎల్నినో ప్రభావాన్ని కొంత మేర ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.