BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధం కావాలి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 11:09 AM
23 వీక్షణలు

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధం కావాలి

విస్సన్నపేటలో ఉద్యాన శాఖ అధికారుల అవగాహన సదస్సు – సబ్సిడీ పథకాలు వినియోగించుకోవాలని సూచన

విస్సన్నపేట: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని విస్సన్నపేట గ్రామంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణతో పాటు ఆధునిక సాగు విధానాలను అనుసరిస్తే పంటలను నష్టాల నుంచి కాపాడుకోవచ్చని అధికారులు రైతులకు వివరించారు.

ఈ సందర్భంగా రైతులు తప్పనిసరిగా ఫైవ్ ప్రిన్సిపల్స్ అయిన ఫార్మ్ పాండ్స్ (వ్యవసాయ కుంటలు), మైక్రో ఇరిగేషన్ (డ్రిప్, స్ప్రింక్లర్), వీడ్ మ్యాట్స్, పీఎండీఎస్ (PMDS) వంటి నీటి సంరక్షణ, తేమ నిర్వహణ పద్ధతులను అమలు చేయాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రతి నీటి బొట్టును ఆదా చేస్తూ శాస్త్రీయ సాగు పద్ధతులను పాటిస్తే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. వ్యవసాయ కుంటల నిర్మాణానికి ₹90,000 వరకు సబ్సిడీ, డ్రిప్ ఇరిగేషన్‌కు సాగు విస్తీర్ణాన్ని బట్టి 50 శాతం నుంచి 100 శాతం వరకు సబ్సిడీ అందుబాటులో ఉందని వివరించారు. ఈ అవకాశాలను వినియోగించుకుని తోటలను, పంటలను వాతావరణ మార్పుల ప్రభావం నుంచి రక్షించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఉప ఉద్యాన సంచాలకులు పద్మావతి, ఎన్టీఆర్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి. బాలాజీ కుమార్, ఉద్యాన శాఖ అధికారి బి. వాసవి సౌజన్య, గ్రామ ఉద్యాన సహాయకుడు సుబ్బారావు, స్థానిక రైతులు పాల్గొన్నారు.