పురుగుమందు తాగి వృద్ధ దంపతుల మృతి
తెలంగాణ
/
జనగామ
రఘునాథపల్లి: జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వృద్ధ దంపతులు పురుగుమందు తాగి మృతి చెందినట్లు ఎస్ఐ నరేశ్ తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మృత దంపతులకు ఐదుగురు సంతానం ఉన్నారు. వారిలో ముగ్గురు కుమారులు వివిధ కారణాలతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు పురుగుమందు తాగినట్లు వారి కుమార్తె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
పురుగుమందు తాగిన దంపతులను గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.