ఎమ్మెల్యే వేముల వీరేశంకు మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారి
ఎమ్మెల్యే వేముల వీరేశంకు మంత్రి హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారి తెలంగాణ శాసనసభ ప్రభుత్వ విప్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నకిరేకల్ సభ్యులు వేముల వీరేశం కు తెలంగాణ ప్రభుత్వం కీలక హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. విప్ల ఉన్న ఎమ్మెల్యే వీరేశం కు రాష్ట్ర మంత్రి హోదాను కేటాయిస్తూ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఉత్తర్వులు (G.O.Rt.No.1064) జారీ చేసింది. మంత్రి హోదా కల్పించిన వారిలో వేముల వీరేశం తో పాటు పెద్దపల్లి శాసనసభ సభ్యుడు చింతకుంట విజయరమణారావు , యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్లు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో ఉన్నాయి వీరికి రాష్ట్ర మంత్రి హోదాతో పాటు, స్టేట్ వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్ లోని ఆర్టికల్ 18 ప్రకారం ప్రాధాన్యత లభిస్తుంది. ఈ ప్రాధాన్యత మరియు హోదా వారు పదవిలో ఉన్నంత కాలం మాత్రమే వ్యక్తిగతంగా వర్తిస్తాయి. సచివాలయ శాఖలు, జిల్లా కలెక్టర్లు, సిపిలు ఎస్పీలు మరియు ఇతర ప్రభుత్వ అధికారులు సదరు నాయకులకు అవసరమైన ప్రోటోకాల్ మరియు తగిన మర్యాదలను అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ మేరకు గవర్నర్ పేరిట ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. నకిరేకల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే వీరేశం కు మంత్రి హోదా ఇవ్వడంతో నియోజకవర్గం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు