BREAKING
32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత
www.ntodaynews.com

ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 May, 2026 - 08:03 PM
65 వీక్షణలు

ఎండ వానల నుండి రక్షణే లక్ష్యం

పుంగనూరు అన్నమయ్య జిల్లా

 పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు పిలుపుతో మానవత్వం చాటుకున్న టీడీపీ రాజంపేట పార్లమెంటు సెక్రటరీ పర్వీన్ తాజ్ బృందం.

పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (TDP) ఇంచార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆదేశాల మేరకు.. పుంగనూరు పట్టణంలోని కట్టమీద రోడ్డు పక్కన,తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చిరువ్యాపారులకు రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ తాజ్, శామీర్ లాల్ మరియు సద్దాం హుస్సేన్ ల బృందం అండగా నిలిచింది.

వాతావరణ మార్పుల వల్ల, ఎండ మరియు అకాల వర్షాల నుండి తమ వ్యాపారాలను, సరుకులను కాపాడుకోవడానికి ఇబ్బంది పడుతున్న పేద వ్యాపారుల కష్టాలను గుర్తించి, చల్లా బాబు గారి సూచనల ప్రకారం వారికి ఉచితంగా టార్పాల్ (టార్పాలిన్) పట్టలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సద్దాం హుస్సేన్ మాట్లాడుతూ.. సమాజంలో కష్టపడి జీవించే చిరువ్యాపారులకు అండగా నిలవడం తమ బాధ్యత అని, చల్లా బాబు  దిశానిర్దేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలను ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల చిరువ్యాపారుల జీవనోపాధి దెబ్బతినకుండా ఉండేందుకే ఈ చిన్న సహాయం చేశామని వారు తెలిపారు.

తమ ఇబ్బందులను అర్థం చేసుకుని, సమయానికి ఎంతో ఉపయోగపడే టార్పాల్ పట్టాలను అందించినందుకు కట్టమీద ప్రాంత తోపుడు బండ్ల వ్యాపారులు చల్లా బాబు గారికి, అలాగే పర్వీన్ తాజ్, శామీర్ లాల్, సద్దాం హుస్సేన్ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూరుల్లా ,ముజాహిద్, నూరుల్లా మౌల ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.