పెనుగొలనులో పింగళి వెంకయ్య వర్ధంతి ఘనంగా నిర్వహణ
జులై 4: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను జిల్లా పరిషత్ హైస్కూల్లో భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడని, వందేమాతరం, హోం రూల్, ఆంధ్ర ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశానికి ఒక ప్రత్యేక జాతీయ జెండా ఉండాలనే సంకల్పంతో 1916లో "భారత దేశానికి ఒక జాతీయ పతాకం" అనే ఆంగ్ల గ్రంథాన్ని రచించారని పేర్కొన్నారు.
సూచనల మేరకు కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో రాట్నం గుర్తుతో పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించారని చెప్పారు. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో గాంధీ ఈ పతాకాన్ని ఎగురవేశారని, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాట్నం స్థానంలో అశోక చక్రాన్ని చేర్చారని వివరించారు.
ఇలాంటి గొప్ప జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు వాడు కావడం ప్రతి తెలుగువారికీ గర్వకారణమని ఆయన అన్నారు. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.