BREAKING
వాహనదారులపై మళ్లీ ఇంధన భారం పెద్దకాపర్తిలో తీవ్ర విషాదం బొమ్మలరామారం మండలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రతీకూల పరిస్థితులో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్ళు జరపడం అభినందనీయం--మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్‌బీఐ సమ్మె వాయిదా.. యథావిధిగా బ్యాంకింగ్ సేవలు వివాహేతర సంబంధం.. భర్త హత్య.. జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య! చదువు రాదన్న సాకు చెల్లదు.. సంతకం పెడితే అప్పు తీర్చాల్సిందే!” మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు బూరుగూడెం రైతు సేవ కేంద్రం పరిధిలో ఉన్న రైతులందరికీ విజ్ఞప్తి ఎండల వేళ పిజిఆర్ఎస్‌కు వచ్చే ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వాహనదారులపై మళ్లీ ఇంధన భారం పెద్దకాపర్తిలో తీవ్ర విషాదం బొమ్మలరామారం మండలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ప్రతీకూల పరిస్థితులో లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం కొనుగోళ్ళు జరపడం అభినందనీయం--మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్‌బీఐ సమ్మె వాయిదా.. యథావిధిగా బ్యాంకింగ్ సేవలు వివాహేతర సంబంధం.. భర్త హత్య.. జేసీబీతో పూడ్చిపెట్టిన భార్య! చదువు రాదన్న సాకు చెల్లదు.. సంతకం పెడితే అప్పు తీర్చాల్సిందే!” మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు బూరుగూడెం రైతు సేవ కేంద్రం పరిధిలో ఉన్న రైతులందరికీ విజ్ఞప్తి ఎండల వేళ పిజిఆర్ఎస్‌కు వచ్చే ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి
www.ntodaynews.com

ఎండల వేళ పిజిఆర్ఎస్‌కు వచ్చే ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 May, 2026 - 06:20 AM
21 వీక్షణలు

వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పిజిఆర్ఎస్‌కు హాజరయ్యే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు. ముఖ్యంగా నడవలేని వారు, మంచానికే పరిమితమైన వారు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పిజిఆర్ఎస్ కేంద్రాలకు తీసుకురావద్దని తెలిపారు. అలాంటి వారి సమస్యలను కుటుంబ సభ్యులు లేదా ప్రతినిధుల ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారిక వెబ్‌సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అర్జీల స్థితి, పరిష్కార ప్రక్రియ లేదా ఇతర సమాచారం కోసం “మీకోసం” టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100ను సంప్రదించాలని సూచించారు.

పిజిఆర్ఎస్‌కు హాజరయ్యే ప్రజల కోసం తాగునీరు, భోజనం వంటి సౌకర్యాలతో పాటు వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అందిన అర్జీలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు.