ఎన్.ఆర్. అశోక్ను పరామర్శించిన దళితుల సంఘం నాయకులు
ఎన్.ఆర్. అశోక్ను పరామర్శించిన దళితుల సంక్షేమ సేవా సంఘం నాయకులు
త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
దళిత నాయకులు, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.ఆర్. అశోక్ అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో, ఏపీ రాష్ట్ర దళితుల సంక్షేమ సేవా సంఘం నాయకులు ఆయనను కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. శంకరప్ప, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పెంచిపల్లి ఎం. కృష్ణప్ప, రాష్ట్ర కమిటీ సభ్యుడు మార్లపల్లి కృష్ణప్ప, జిల్లా కార్యదర్శి మార్లపల్లి కె. సుబ్రమణ్యం, జిల్లా యూత్ సెక్రటరీ కంటేపల్లి గంగరాజు, కేసిపల్లి పీ. మునిరాజు తదితరులు పాల్గొన్నారు.
నాయకులు ఎన్.ఆర్. అశోక్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షించారు.
అలాగే ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని, నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవించాలని ఏడుకొండల వెంకటరమణ స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు.