www.ntodaynews.com
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో ఉచిత నేత్ర శిబిరం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం ఊటుకూరు గ్రామంలో ఉచిత నేత్ర శిబిరం
టీడీపీ గంపలగూడెం మండల నాయకులు చెరుకూరి రాజేశ్వర రావు సతీమణి లక్ష్మి రాణమ్మ జ్ఞాపకార్దనిమిత్తం జరిగిన ఉచిత మెడికల్ క్యాంప్లో శంకర నేత్ర కంటి ఆసుపత్రి గుంటూరు వారి ఆధ్వర్యంలో 270 మందికి కంటి పరీక్షలు నిర్వహించబడ్డాయి. వీరిలో 80 మందికి అవసరమైన ఆపరేషన్లు పూర్తి చేశారు. ఈ రోజు, ఉచిత కళ్లజోడులు పంపిణీ కార్యక్రమం విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెరుకూరి రాజేశ్వరరావు చేతుల మీదుగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా 200 మంది లబ్ధిదారులకు కళ్లజోడులు అందించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.