www.ntodaynews.com
ఎర్ర ఆముదం కాయలు తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులు...
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
ఎర్ర ఆముదం కాయలు తిని తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులు...
అన్నమయ్య జిల్లా.
పుంగనూరు.
రామసముద్రం మండలం పేడరాశిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏడుగురు చిన్నారులు ఎర్ర ఆముదం కాయలు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారులను పుంగనూరు, మదనపల్లి, రామసముద్రం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు
గ్రామంలో వరుసగా చిన్నారులు అస్వస్థతకు గురికావడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఘటన శుక్రవారం ఉదయం వెలుగులో వచ్చింది