BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 07 April 2025, 02:45 am
Posted by : NTODAY NEWS OFFICIAL

హాసీఫ్ నహర్ కాలువ నీటిని ఆపాలంటూ డిప్యూటీ ఇంజనీర్ కు రైతులు వినతి

తెలంగాణ
07 Apr, 2025 - 02:45 AM
160 వీక్షణలు
హాసీఫ్ నహర్ కాలువ నీటిని ఆపాలంటూ డిప్యూటీ ఇంజనీర్ కు రైతులు వినతి (NTODAY NEWS) కూనూరు మధు నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న నీటిపారుదల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వారి కార్యాలయంలో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం గ్రామ రైతులు డిప్యూటీ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఆసిఫ్ నాహర్ కాలువ నీటిని తాత్కాలికంగా నిలిపివేయాలంటూ వినతి పత్రం అందజేశారు , రామన్నపేట మండలంలోని కక్కిరేణి పల్లివాడ, దుబ్బాక పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు ఈ కాల్వ ద్వారా వచ్చే నీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వాపోయారు, పంట చేతికందే సమయంలో కాలువ నీటి విడుదల చేయడం ద్వారా పంట కోసుకోవడానికి ఇబ్బందిగా మారుతుందని, పొలాల్లో వరి కోత యంత్రాలు, జెసిబి లు ఇరుక్కుపోయి పంట చేతి అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో కూడా ఇటువంటి ఇబ్బంది పడి చాలా పంటను నష్టపోయామని ఈ కాలువ ద్వారా వచ్చే నీటి ప్రవాహం కోతకు వచ్చిన పంట ను నాశనం చేస్తుందని రైతులు ఎన్నో అప్పులు చేసి పంట పండిస్తుంటే ఈ నీటి ద్వారా పంట నష్టపోయిన రైతులకు కన్నీటిని మిగిలిస్తుందని ఈ కాలువను తాత్కాలికంగా నీటి విడుదల ఆపివేయాలంటూ చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న డిప్యూటీ ఇంజనీర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కక్కిరేణి పల్లివాడ మునిపంపుల నుండి పాల్గొన్న రైతులు అయ్యేడపు నర్సిరెడ్డి ,పిట్ట కృష్ణారెడ్డి , నరసింహారెడ్డి , వేముల సైదులు గుండాల మల్లేశం , ఎ . కృష్ణయ్య , నడిగోటి నరేష్ , భాష కర్ల నరేందర్ రెడ్డి , చిల్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube