BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దు-జిల్లా కలెక్టర్

తెలంగాణ
04 Apr, 2025 - 06:40 AM
189 వీక్షణలు
పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దు-యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, ఏప్రిల్ 04 గురువారం జిల్లాలో కురిసిన అకాల వర్షం,ఈదురు గాలులు,వడగళ్ల వానతో,నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం రోజున తుర్కపల్లి మండలంలోని తుర్కపల్లి మరియు దయ్యం బండ తండాలో నిన్న కురిసిన అకాల వర్షాలు,ఈదురు గాలులు,వడగళ్ల వానకు వరి చేనులు,మామిడి తోటలు కాయగూరల పంటలు,మిర్చి వంటి కొన్ని రకాల పంటలు వేసినందున్న చేతికి వచ్చిన పంటలు రైతులు నష్టపోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో కొన్ని ఎకరాల పంటలు నష్టపోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.నష్టపోయిన పంట పొలాలు, తోటలను రైతులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎంతో కష్టపడి పండించిన వరి పంటలు అకాల వర్షాల వల్ల రైతులు ఎన్నో ఎకరాలు నష్టపోయారని దానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామాలలో , క్షేత్రస్థాయిలో పంటలను,తోటలను పరిశీలిస్తున్నారని అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం నష్ట పోయిన ప్రతి రైతు యొక్క వివరాలు నమోదు చేసుకొని ఆ నివేదికను ప్రభుత్వానికి పంపించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని కలెక్టర్ రైతులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ దేశ్యనాయక్ , హార్టికల్చర్ అధికారి సుభాషిణి,యంపిడిఓ,సంబందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube