BREAKING
ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు
Date of Publish : 09 January 2026, 09:37 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సర్పంచుల హక్కుల కోసం పోరాటం

తెలంగాణ
09 Jan, 2026 - 09:37 AM
261 వీక్షణలు

రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కొమ్ము కృష్ణ ఏకగ్రీవ ఎన్నిక

సర్పంచుల హక్కుల కోసం పోరాటం: కొమ్ము కృష్ణ NTODAY NEWS: షాద్‌నగర్ రిపోర్టర్  శ్రీహరి రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా నందిగామ గ్రామ సర్పంచ్ కొమ్ము కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా కొమ్ము కృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ బాధ్యత అప్పగించడంపై ఆనందం వ్యక్తం చేశారు. సర్పంచుల హక్కులు, నిధులు, విధుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గతంలో రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవంతో జిల్లా వ్యాప్తంగా సర్పంచులకు అండగా నిలుస్తానని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నాయకత్వాన్ని ప్రశంసించిన కొమ్ము కృష్ణ, నియోజకవర్గ అభివృద్ధితో పాటు గ్రామాల అభ్యున్నతికి ఆయన చూపుతున్న చొరవ అభినందనీయమని అన్నారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే స్థాయిలో సహకారం అందుతోందని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలికట్ట సర్పంచ్ నరసింహ, కొత్తూరు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు, పెంజర్ల సర్పంచ్ ఎర్రర్ల జగన్, నర్సప్పగూడ సర్పంచ్ మల్లేష్, గూడూర్ సర్పంచ్‌తో పాటు పలువురు గ్రామ సర్పంచులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube