BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

పెళ్లికి పదో తరగతి మిత్రుల ఆర్థిక సాయం

తెలంగాణ
08 Mar, 2026 - 08:38 PM
251 వీక్షణలు
స్నేహితురాలి పెళ్లికి పదో తరగతి మిత్రుల ఆర్థిక సాయం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ కష్టాల్లో ఉన్న స్నేహితురాలికి అండగా నిలుస్తూ పదో తరగతి పాత మిత్రులు ఆదర్శం చూపించారు. పేదరికం ఆమె వివాహానికి అడ్డంకి కాకూడదని భావించి తమ వంతు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వెల్గటూర్ మండల కేంద్రానికి చెందిన పుట్టపాక రజిత నిరుపేద కుటుంబానికి చెందిన యువతి. తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రజితకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ విషయం తెలుసుకున్న వెల్గటూర్ మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో చదివిన ఆమె పదో తరగతి (2005–2006 బ్యాచ్) మిత్రులు స్పందించారు. వార్డు సభ్యుడు నక్క సురేష్ ఆధ్వర్యంలో ఆ బ్యాచ్‌కు చెందిన మిత్రులు కలిసి రూ.16,000 నగదును సేకరించారు. ఆదివారం జరిగిన వివాహ వేదిక వద్దకు వెళ్లి ఆ మొత్తాన్ని రజితకు అందజేసి తమ స్నేహాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నక్క సురేష్ మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో కలిసి ఉన్న స్నేహితురాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుని తమ వంతుగా ఈ సహాయం చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూగల సంతోష్, అరెల్లి స్వామి, వేముల పరమేష్, మెరుగు నరేష్, పోతు నాగరాజు, బోరె చందు, శిరీష, సరిత, కవిత, లలిత, భాగ్యలక్ష్మి, సుమలత, మమత తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరూ కలిసి చేసిన ఈ సేవను స్థానికులు అభినందించారు. #Velgatoor #Jagtial #Friendship #HelpingHands #TelanganaNews #SocialService #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube