BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

పునఃప్రతిష్టా ప్రథమ వార్షికోత్సవం

తెలంగాణ
20 Feb, 2026 - 08:49 PM
163 వీక్షణలు
పైడిపెల్లిలో వైభవంగా మల్లికార్జున స్వామి పునఃప్రతిష్టా ప్రథమ వార్షికోత్సవం NTODAY NEWS: వెల్గటూర్,(గొల్లపల్లి మండల ప్రతినిధి లక్ష్మణ్) జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపెల్లి గ్రామంలో ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయంలో పునఃప్రతిష్టా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు రెండు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొదటి రోజు ఉదయం నుంచి ఆలయంలో అఖండ దీపారాధన, ప్రణవ పతాకావిష్కరణ, శివ పంచాయతన పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. 108 బిల్వార్చనలు, నవగ్రహ పూజలు, దైవయజ్ఞం, రుద్రహోమం, పూర్ణాహుతి, మంగళహారతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. రెండవ రోజు స్వామివారికి పెద్ద పట్నం, బోనాలు, అగ్నిగుండాల జాతర మహోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఉత్సవాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ మరియు సామాజిక రంగాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. వెల్గటూర్ మండలం సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కుస లక్ష్మణ్ యాదవ్, గొడిషెలపేట సర్పంచ్ కందికట్ల అమృత రాజేశం, ధర్మపురి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు యాదవ్ హాజరయ్యారు. వీరితో పాటు పైడిపెల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి హరీష్ యాదవ్, పెద్దగొల్ల సంగం శ్రీనివాస్ యాదవ్, యాదవ సంఘం అధ్యక్షుడు నక్క సత్తయ్య యాదవ్, గాలి పర్వతాలు, ఎలాంల్ల రాయలింగు యాదవ్, సల్ల గంగయ్య యాదవ్, పుణ్యకుర్తి శ్రావణ్ యాదవ్, నక్క మొగిలి యాదవ్, కనవేని తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. #Paidepelli #MallikarjunaSwamy #TempleFestival #Jagtial #Velgatoor #TelanganaTemples #SpiritualEvents Follow us on Website Facebook Instagram YouTube