BREAKING
నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం..
Date of Publish : 20 February 2026, 08:49 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

పునఃప్రతిష్టా ప్రథమ వార్షికోత్సవం

తెలంగాణ
20 Feb, 2026 - 08:49 PM
202 వీక్షణలు
పైడిపెల్లిలో వైభవంగా మల్లికార్జున స్వామి పునఃప్రతిష్టా ప్రథమ వార్షికోత్సవం NTODAY NEWS: వెల్గటూర్,(గొల్లపల్లి మండల ప్రతినిధి లక్ష్మణ్) జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపెల్లి గ్రామంలో ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయంలో పునఃప్రతిష్టా ప్రథమ వార్షికోత్సవ వేడుకలు రెండు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు మొదటి రోజు ఉదయం నుంచి ఆలయంలో అఖండ దీపారాధన, ప్రణవ పతాకావిష్కరణ, శివ పంచాయతన పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. 108 బిల్వార్చనలు, నవగ్రహ పూజలు, దైవయజ్ఞం, రుద్రహోమం, పూర్ణాహుతి, మంగళహారతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. రెండవ రోజు స్వామివారికి పెద్ద పట్నం, బోనాలు, అగ్నిగుండాల జాతర మహోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఉత్సవాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ మరియు సామాజిక రంగాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. వెల్గటూర్ మండలం సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు కుస లక్ష్మణ్ యాదవ్, గొడిషెలపేట సర్పంచ్ కందికట్ల అమృత రాజేశం, ధర్మపురి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కొమ్ము రాంబాబు యాదవ్ హాజరయ్యారు. వీరితో పాటు పైడిపెల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి హరీష్ యాదవ్, పెద్దగొల్ల సంగం శ్రీనివాస్ యాదవ్, యాదవ సంఘం అధ్యక్షుడు నక్క సత్తయ్య యాదవ్, గాలి పర్వతాలు, ఎలాంల్ల రాయలింగు యాదవ్, సల్ల గంగయ్య యాదవ్, పుణ్యకుర్తి శ్రావణ్ యాదవ్, నక్క మొగిలి యాదవ్, కనవేని తిరుపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు ఆకాంక్షించారు. #Paidepelli #MallikarjunaSwamy #TempleFestival #Jagtial #Velgatoor #TelanganaTemples #SpiritualEvents Follow us on Website Facebook Instagram YouTube