కౌండిన్య గౌడ సంఘం కామ్యూనిటీ హల్ ప్రారంభించిన సత్తుపల్లి ఎమ్మెల్యే
గంగారాంలో శ్రీ కృష్ణ భవన్, కౌండిన్య గౌడ సంఘం కామ్యూనిటీ హల్ ప్రారంభించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్
సత్తుపల్లి మండలం గంగారాం గ్రామంలో కీ. శే. దాసరి వీరరెడ్డి, కీ. శే. లక్ష్మి కాంతమ్మ అశీసులుతో, శ్రీ దాసరి వెంకట్రామిరెడ్డి, రాజకుమారి దంపతుల సౌజన్యంతో నిర్మించిన శ్రీ కృష్ణ భవన్, మరియు గౌడ సంఘం కామ్యూనిటీ హల్ ప్రారంభత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డా. మట్టా దయానంద్ విజయకుమార్ గారు పాల్గొని శ్రీ కృష్ణ భవన్, గౌడ్ సంఘం కామ్యూనిటీ హల్ ను ప్రారంభించారు. అనంతరం శ్రీ కృష్ణ అష్టమి సందర్భంగా శ్రీ కృష్ణ మందిరం లో స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానా కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో గంగారాం కాంగ్రెస్ యువ నాయకులు దాసరి మధు మోహనరెడ్డి, గంగారం సర్పంచ్ కాకర్ల రేవతి, ఉప సర్పంచ్, బెజవాడ రాధ, వార్డ్ సభ్యులు, సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గౌడ సంఘం నాయకులు, యాదవ సంఘం నాయకులు, రామగోవిందాపురం, పాకాలగూడెం గ్రామాల సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు