BREAKING
సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం.
www.ntodaynews.com

గంపలగూడెం మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 11:41 AM
17 వీక్షణలు

గంపలగూడెం మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం

కొత్త అర్హుల పింఛన్ల కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలంలో శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. మండలంలోని గంపలగూడెం, ఊటుకూరు, నెమలి, మేడూరు, పెనుగొలను తదితర గ్రామాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు. లబ్ధిదారులు తమ ఇళ్ల వద్దే పింఛన్లు అందుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 1న మొత్తం 2,24,793 మంది అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

అయితే, కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులు ఇప్పటికీ మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కారణాలతో అర్హత ఉన్నప్పటికీ తమకు పింఛన్లు మంజూరు కాలేదని, ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా తమ దరఖాస్తులు ఇంకా ఆమోదం పొందలేదని పలువురు వృద్ధులు, వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరితగతిన పింఛన్లు మంజూరు చేసి పంపిణీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.