గంపలగూడెంలో అన్నసమారాధన కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం గంపలగూడెంలో మంగళవారం పేదలు, అనాథలు, వృద్ధులు, కార్మికుల కోసం అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. గంపలగూడెంలోని కుందా కోటేశ్వరరావు నివాసం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు చెందిన పలువురు పేదలు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తన భార్య సావిత్రి జ్ఞాపకార్థం దాత కుందా కోటేశ్వరరావు ఈ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా ప్రథమ పూజాధిపతి శ్రీ గణపతి మహారాజ్కు పూజలు నిర్వహించిన అనంతరం అన్నసమారాధన చేపట్టారు. ప్రతి నెల ప్రతి మంగళవారం అన్నసమారాధన నిర్వహిస్తూ పేదలకు భోజనం అందిస్తున్న దాత కుందా కోటేశ్వరరావుకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.