గంపలగూడెంలో ఘనంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండల కేంద్రంలో సోమవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 45 రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు ఇంటింటికీ వెళ్లి వివరించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
అలాగే ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ (ఎంఆర్కే), వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ రేగళ్ల లక్ష్మి అనిత, వీరారెడ్డి దంపతులు, టౌన్ పార్టీ అధ్యక్షుడు కాజా రవి, మాజీ సర్పంచ్ కోట పుల్లమ్మ, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.