www.ntodaynews.com
గంపలగూడెంలో విషాదం.. చెరువులో మునిగి యువకుడు మృతి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
గంపలగూడెంలో విషాదం.. చెరువులో మునిగి యువకుడు మృతి
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం అనుములంక గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంగిడి చెరువులో ఈతకు వెళ్లిన మిరియాల రమేష్ (19) ప్రమాదవశాత్తు మునిగిపోయాడు.
సమాచారం అందుకున్న వెంటనే గ్రామస్తులు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. రమేష్ విజయవాడ నుంచి తన అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. నిన్న అమ్మమ్మ ఇంట్లో దేవుడిని పెట్టుకున్న సందర్భంలో కుటుంబ సభ్యులతో కలిసి గ్రామానికి వచ్చినట్టు సమాచారం.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.