www.ntodaynews.com
గూడెం గుట్టలో కేటీఆర్ ప్రత్యేక పూజలు
తెలంగాణ
/
మంచిర్యాల
/
దండేపల్లి
గూడెం గుట్టలో కేటీఆర్ ప్రత్యేక పూజలు
మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గూడెం గుట్టలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికి, తీర్థ ప్రసాదాలు మరియు స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ తదితరులు పాల్గొన్నారు