గ్రామ పంచాయతీ కార్మికుల హక్కులు కాపాడాలి : సీఐటీయూ డిమాండ్
గ్రామ పంచాయతీ కార్మికుల హక్కులు కాపాడాలి : సీఐటీయూ డిమాండ్
నల్గొండ జిల్లా చిట్యాల మండల గ్రామ పంచాయతీ కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు అమలుచేసి తక్షణమే కార్మిక హక్కులను కాపాడాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ డిమాండ్ చేశారు. బుధవారం చిట్యాల మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఏళ్ల తరబడి గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. దీర్ఘకాలంగా సేవలందిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులపై భారం పెంచుతున్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అర్హులైన కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అంతకుముందు కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎంపీడీఓ జె. పాండు, ఎంపీఓ కోటేష్, సూపరింటెండెంట్ మనోహర్కు సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ సభ్యురాలు మంకాల బాలమ్మ, జిల్లా కమిటీ సభ్యులు సిరిపంగి యాదయ్య, యూనియన్ మండల నాయకులు చిరుమర్తి బిక్షపతి, గుర్రం లింగస్వామి, అరూరి మల్లేష్, నర్సింహా, స్వరూప, సువర్ణ, నిర్మల, సుజాత, అండాలు, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.