BREAKING
రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ రౌడీ, హిస్టరీ షీటర్ల పై నిరంతర నిఘా ఉంచాలి – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్.... మంత్రులను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పల్నాడు జిల్లా కారంపూడి ఎస్సై వాసు సస్పెండ్... వెంకట్రావుపేట అంగన్‌వాడీ కేంద్రాల సమస్యల పరిష్కారానికి సర్పంచ్‌కు వినతిపత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం: ఎన్నికల కమిషన్ వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ నలిమేల రాజు ఆధ్వర్యంలో గ్రామ సభ పల్నాడులో టెట్ కు పక్కా ఏర్పాట్లు: జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన రావులపాలెంలో AP GEN-Z WAR బస్ భవన్ ముట్టడితో ఉద్రిక్తత.. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని తీన్మార్ మల్లన్న డిమాండ్
www.ntodaynews.com

గర్భిణులు, బాలింతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Aug, 2026 - 07:22 PM
13 వీక్షణలు

గర్భిణులు, బాలింతల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం  మధిరలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా శ్రీమంత–అన్నప్రాసన వేడుకలు

మధిర, ఆగస్టు 6: తల్లిపాల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా మధిరలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శ్రీమంత, అన్నప్రాసన వేడుకలు సంప్రదాయబద్ధంగా ఘనంగా జరిగాయి. గర్భిణులకు శ్రీమంతం, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ సామినేని సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సామినేని సుజాత మాట్లాడుతూ గర్భిణులు, బాలింతల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, వారి ఆరోగ్య రక్షణ కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఆధునిక జీవనశైలిలోనూ మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. గర్భధారణ దశ నుంచే పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన తల్లి, బిడ్డతో పాటు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు పడతాయని పేర్కొన్నారు.

మున్సిపల్ కమిషనర్ సామ్యూల్ పాల్ మాట్లాడుతూ ఐసీడీఎస్, అంగన్వాడీ వ్యవస్థల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు అందుతున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. పీడీ ఏ. ప్రమీల, సీడీపీఓ జి. కృష్ణశ్రీ, ఎస్సీడీపీఓ షకీరా పర్యవేక్షణలో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.

కార్యక్రమంలో గర్భిణులకు సంప్రదాయ పద్ధతిలో ఓడీ పోసి, అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.