ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి పోటెత్తిన భక్తులు
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్: సెలవు దినం కావడంతో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల రాక పెరగడంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్యాంక్బండ్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్, భద్రతా పరిస్థితులను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.
మరోవైపు భక్తుల కోసం జలమండలి ఆధ్వర్యంలో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులకు తాగునీరు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.