BREAKING
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU
www.ntodaynews.com

గుల్లకోటలో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ భూమిపూజ మహోత్సవం

తెలంగాణ
Reporter
గంగుల రాజ్ కుమార్ లక్సెట్టిపేట్ మండల ప్రతినిధి
19 Aug, 2026 - 11:51 AM
80 వీక్షణలు

గుల్లకోటలో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ భూమిపూజ మహోత్సవం

మంచిర్యాల నియోజకవర్గం: లక్షెట్టిపేట్ మండలంలోని గుల్లకోట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం ఎంతో పవిత్రమైన కార్యక్రమమని అన్నారు. ఆలయ నిర్మాణ పనులకు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.

ముందుగా గుల్లకోట గ్రామస్తులు సురేఖమ్మకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో సురేఖమ్మ గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, సర్పంచులు బానేష్, భాను, జిల్లా నాయకులు పూర్ణచందర్ రావు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.