గుల్లకోటలో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ భూమిపూజ మహోత్సవం
గుల్లకోటలో ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ భూమిపూజ మహోత్సవం
మంచిర్యాల నియోజకవర్గం: లక్షెట్టిపేట్ మండలంలోని గుల్లకోట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సురేఖమ్మ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలిచే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ నిర్మాణం ఎంతో పవిత్రమైన కార్యక్రమమని అన్నారు. ఆలయ నిర్మాణ పనులకు మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ఆలయ నిర్మాణం త్వరితగతిన పూర్తై భక్తులకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
ముందుగా గుల్లకోట గ్రామస్తులు సురేఖమ్మకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో సురేఖమ్మ గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, సర్పంచులు బానేష్, భాను, జిల్లా నాయకులు పూర్ణచందర్ రావు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.