BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. మూడు కార్లు ఢీకొని 8 మందికి గాయాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / గుండ్రాంపల్లి
28 Jun, 2026 - 01:28 PM
458 వీక్షణలు

నల్గొండ | NTODAY NEWS

నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలోని జాతీయ రహదారి-65 (NH-65)పై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు ఎనిమిది మంది గాయపడ్డారు. మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొని బోల్తా పడటంతో హైవేపై కొంతసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, విజయవాడ వైపు వెళ్తున్న డి-మ్యాక్స్ వి-క్రాస్ వాహనం టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో వాహనం డివైడర్‌ను దాటి ఎదురుగా ఉన్న హైదరాబాద్ వైపు వెళ్లే రహదారిపైకి దూసుకెళ్లి బోల్తా పడింది.

అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న కియా కారుతో పాటు మరో కారు రోడ్డుకు అడ్డంగా పడిన వి-క్రాస్ వాహనాన్ని ఢీకొన్నాయి. ఈ ఢీకొట్టిన ప్రభావంతో మూడు వాహనాలు రోడ్డుపై బోల్తా పడ్డాయి.

ఈ ప్రమాదంలో వాహనాల్లో ప్రయాణిస్తున్న సుమారు ఎనిమిది మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం కారణంగా హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో సుమారు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. హైవే ట్రాఫిక్ పోలీసులు, ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ల సహాయంతో ప్రమాదానికి గురైన వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.