BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

గుంటూరు: జీఎంసీలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు..

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Aug, 2026 - 07:05 PM
27 వీక్షణలు

గుంటూరు: జీఎంసీలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. ఇంజినీరింగ్ విభాగంలో భారీ అవకతవకలపై విచారణ

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జీఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో 10 మందికి పైగా ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.

ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన టెండర్లు, పనుల ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ.. జీఎంసీ ఇంజినీరింగ్ విభాగంపై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. 2017 నుంచి 2025 వరకు జరిగిన టెండర్లలో శాతం మార్పులు, అవకతవకలపై విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

మొత్తం 156 ఫైళ్లలో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందిందని, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్ల పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు. విచారణ రేపు కూడా కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.