గుంటూరు: జీఎంసీలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు..
గుంటూరు: జీఎంసీలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు.. ఇంజినీరింగ్ విభాగంలో భారీ అవకతవకలపై విచారణ
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జీఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో జరుగుతున్న ఈ తనిఖీల్లో 10 మందికి పైగా ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.
ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన టెండర్లు, పనుల ఫైళ్లను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ.. జీఎంసీ ఇంజినీరింగ్ విభాగంపై వచ్చిన పలు ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. 2017 నుంచి 2025 వరకు జరిగిన టెండర్లలో శాతం మార్పులు, అవకతవకలపై విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
మొత్తం 156 ఫైళ్లలో అవకతవకలు జరిగినట్లు సమాచారం అందిందని, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్ల పనులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు. విచారణ రేపు కూడా కొనసాగుతుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.