www.ntodaynews.com
గుంటూరులో ఘోరం.. ఎలుకలు కొరికి తిన్న మృతదేహం గుర్తింపు
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
గుంటూరు రైల్వే స్టేషన్ ఎదురుగా గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో కలకలం రేగింది. మృతదేహంలోని కొంత భాగాన్ని ఎలుకలు కొరికి తినడంతో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. స్థానికుల సమాచారం మేరకు కొత్తపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రెడ్క్రాస్, కోవిడ్ ఫైటర్స్ సభ్యుల సహకారంతో మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది.