BREAKING
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం
www.ntodaynews.com

టి.గుడిపాడు శివారులో కోడిపందాలపై పోలీసుల దాడి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 10:39 AM
46 వీక్షణలు

చాట్రాయి, జూన్ 24: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం టి.గుడిపాడు గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరంపై చాట్రాయి పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాలు, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఐ.వి. నాగేంద్ర కుమార్ పర్యవేక్షణలో చాట్రాయి ఎస్‌ఐ డి. రామకృష్ణకు అందిన సమాచారంతో ఈ దాడులు చేపట్టారు. దాడిలో ఒక కోడి పుంజు, రెండు కోడి కత్తులు, రూ.2,800 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఆరు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ డి. రామకృష్ణ మాట్లాడుతూ ప్రజలను ఆర్థికంగా నష్టపరిచే జూద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. జూదాన్ని నిర్వహించే వారిపైనా, పాల్గొనే వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కోడిపందాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే డయల్-112కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.