www.ntodaynews.com
నాదెండ్లలో బాలిక అదృశ్యం.. కేసు నమోదు
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
నాదెండ్ల మండల కేంద్రంలో 17 ఏళ్ల బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న బాలిక ఈ నెలలో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికకు 18 ఏళ్లు పూర్తికాకముందే వివాహం చేయాలని కుటుంబ పెద్దలు భావించడంతో ఇంటిని విడిచి వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు.