BREAKING
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..! విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: శాసన మండలి చైర్మన్ మహబూబాద్ జిల్లాలో గ్రంథాలయం సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం తొర్రూరు మండలం 9వ వార్డు కౌన్సిలర్ వివాహ వేడుక నీట్ పేపర్ లీకేజీపై యువజన కాంగ్రెస్ నిరసన జ్వాలలు జర్నలిస్టుల ​హక్కుల పరిరక్షణకు ఏకైక వేదిక టీయుడబ్ల్యూజే (ఐజేయు) ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మే 17న ఇబ్రహీంపట్నంలో ఏపిడబ్ల్యూజేఎఫ్, ఏపిబీజేఏ ఎన్టీఆర్ జిల్లా మహాసభలు రైతు భరోసా కేంద్రంలో సిబ్బంది గైర్హాజరు.. రైతులు అవస్థలు! ట్రాన్స్‌జెండర్లకు గుడ్‌న్యూస్.. కూటమి సర్కార్ కీలక నిర్ణయం..!
www.ntodaynews.com

కుప్పలుగా రాసులు, అయోమయంలో రైతులు, పట్టించుకోని అధికారులు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
13 May, 2026 - 08:40 AM
121 వీక్షణలు

కుప్పలుగా రాసులు, అయోమయంలో రైతులు, పట్టించుకోని అధికారులు

కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం,నాగినేనిపల్లి రైతులు సయ్యద్ మౌలానా పాషా ఆరోపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం అమ్ముకునేందుకు గ్రామ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్ని సంచులు లేకపోవడం,కాంట అయిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు అందుబాటులో లేక రైతులు రోజులు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు కళ్లల్లో కన్నీరు పెట్టుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. తరుగుపేరు చెప్పి బస్తాకు పది కిలోల వరకు కటింగ్ చేయడం రైతులపై జరుగుతున్న బహిరంగ దోపిడీ అని ఆయన మండిపడ్డారు. ఏ గ్రేడ్ గాఉన్న ధాన్యాన్ని బి గ్రేడ్ గా మార్చి రైతులను మోసం చేస్తున్న మిల్లర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు, మండలంలోని కొనుగోలు కేంద్రాలలో వెంటనే  అవసరమైన గన్ని సంచులు, లారీలు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.