BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 13 September 2026, 11:51 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

22A పేరుతో పట్టాదారు రైతుల భూములపై కాంగ్రెస్ భూదందా

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
13 Sep, 2026 - 11:51 PM
11 వీక్షణలు

22A పేరుతో పట్టాదారు రైతుల భూములపై కాంగ్రెస్ భూదందా – నిజమైన హక్కుదారులను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలి:

జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్  

రాయికల్ (NToday News):

రాయికల్ పట్టణంలో BRS నాయకులతో కలిసి జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

​పాత్రికేయుల సమావేశంలో దావ వసంత సురేష్ మాట్లాడిన ముఖ్యాంశాలు:

​22A పేరుతో కొత్త భూదందా: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా, అమలు కాని అనాలోచిత హామీలతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. 22A నిషేధిత జాబితా పేరుతో పట్టాదారు రైతుల భూములపై కాంగ్రెస్ భూదందాకు తెరలేపిందని ఆరోపించారు.

​జగిత్యాలలో 16,005 ఎకరాల పట్టా భూముల నిలిపివేత: తెలంగాణ వ్యాప్తంగా కోటి ఎకరాలను, ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే 16,005 ఎకరాల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చారని తెలిపారు. అధికారులకు లంచాలు ఇస్తేనే జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారని విమర్శించారు.

​రైతులకు తెలియకుండానే భూముల బ్లాకింగ్: ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూములను కాపాడాల్సిన చట్టాన్ని పేద రైతుల మెడకు ఉరితాళ్లుగా మార్చారని, చాలామంది రైతులకు తమ భూములు 22A లో ఉన్నాయనే విషయమే తెలియక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

​వెంటనే రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి: గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులు నిర్వహించి, నిజమైన పట్టాదార్లను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని BRS పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

​వ్యవసాయ రంగం నిర్వీర్యం: రాష్ట్రంలో 24 గంటల కరెంటు కోతలు, ఎరువుల కొరతతో రైతులు అరిగోస పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను సద్వినియోగం చేసుకోలేక, ఎల్-నినో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రైతులకు ఎకరానికి ₹20,000 క్రాప్ హాలిడే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

​ఈ కార్యక్రమంలో BRS పట్టణ, మండల అధ్యక్షుడు అనిల్ కుమార్, బర్కాం మల్లేష్, కో-ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, జగిత్యాల PACS చైర్మన్ మహిపాల్ రెడ్డి, నాయకులు గోపి రాజి రెడ్డి, బత్తిని నాగరాజు, ప్రశాంత్ రావు, రామపతి రావు, చాంద్ పాషా, సంతోష్ రావు, పడిగేలా గంగారెడ్డి, సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.