www.ntodaynews.com
విద్యార్థులకు జామెట్రీ బాక్స్లు, పెన్స్ పంపిణీ
తెలంగాణ
పదో తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్స్లు, పెన్స్ పంపిణీ
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్స్లు, పెన్స్, స్కేల్స్ను జాగిని మధుసూదన్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని ఆకాంక్షించారు.
గ్రామ సర్పంచ్ కడెం పాండురంగం విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఉప సర్పంచ్ అరిగే శ్రీధర్ మాట్లాడుతూ కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని విద్యార్థులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ AAPC చైర్మన్ మంద స్వప్న, మాజీ స్కూల్ చైర్మన్ రాజమల్లేష్, సాయి ప్రసాద్, బస్వసాయి రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీధర్, బాల్రాజ్, ప్రభావతి, శోభారాణి, కవిత, రాజేశ్వరి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
#Bibinagar #Kondamadugu #EducationSupport #10thClassStudents #SchoolProgram #TelanganaNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube