BREAKING
ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి ఎన్ టుడే న్యూస్ ఎఫెక్ట్ : చిట్యాలలో కదిలిన యంత్రాంగం.. తిరువూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా.. ఆర్‌డీఓకు ఫిర్యాదు బాధితులకు తక్షణ న్యాయమే లక్ష్యం.. ​నిర్ణీత గడువులోగా సి.ఎం.ఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలి మేడ్చల్ జిల్లాలో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ ఎంఆర్వో పట్టుబాటు..! పేదల ఇంటికే పింఛన్లు.. ఏపీలోనే అత్యధిక సామాజిక భద్రత ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక తాతకుంట్ల గ్రామంలో యువకుడు ఉరివేసుకుని మృతి పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై అధికారుల కఠిన హెచ్చరిక విజయవాడ నగరపాలక సంస్థలో ప్రతి ఫిర్యాదుకు సంతృప్తి కరమైన మరియు శాశ్వత పరిష్కారం అందించాలి
www.ntodaynews.com

ప్రభుత్వాలు వెంటనే ‘బీసీ యాక్ట్’ ఏర్పాటు చేయాలి

తెలంగాణ
27 Feb, 2026 - 07:29 AM
192 వీక్షణలు
కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ‘బీసీ యాక్ట్’ ఏర్పాటు చేయాలి NTODAY NEWS: మంచిర్యాల ప్రతినిధి శ్రీనివాస్ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ మంచిర్యాల, 26-02-2026: బీసీల సామాజిక రక్షణ, భద్రత కోసం ప్రత్యేకంగా ‘బీసీ యాక్ట్’ తీసుకురావాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. దేశం మరియు రాష్ట్రంలో బీసీల డిమాండ్లపై దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గానీ, రాష్ట్రంలో గతం మరియు ప్రస్తుత ప్రభుత్వాలు గానీ స్పష్టమైన చర్యలు తీసుకోలేదని సంస్థ ప్రతినిధులు విమర్శించారు. మంచిర్యాలలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు శాఖపురి భీంసేన్, చంద్రమౌళి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే ప్రకటన చేయడం స్వాగతించదగినదని తెలిపారు. దేశవ్యాప్తంగా బీసీల రక్షణకు చట్టపరమైన భరోసా అవసరమని పేర్కొన్నారు. గతంలో వరంగల్‌లో యాదవ యువతిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనతో పాటు నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడి ఘటనలను ప్రస్తావిస్తూ బీసీ వర్గాలకు తగిన రక్షణ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు బీసీల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే ‘బీసీ యాక్ట్’ను అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. #Mancherial #BCAct #BCRights #SocialJustice #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube