హైదరాబాద్: మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జి ప్రారంభం
తెలంగాణ
/
హైదరాబాద్
హైదరాబాద్ మూసీ నదిపై అంబర్పేట–దిల్సుఖ్నగర్ మార్గంలో నిర్మించిన ముసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి బ్రిడ్జిని పరిశీలించిన ముఖ్యమంత్రి.. అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
రూ.52 కోట్ల వ్యయంతో 400 మీటర్ల పొడవున నిర్మించిన ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో అంబర్పేట, దిల్సుఖ్నగర్ ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.